డా. అట్టెం దత్తయ్య లక్ష్మి, మల్లయ్యలకు 26.12.1983లో కామారెడ్డి జిల్లా, లింగంపేట్‌ మండలం, శట్పల్లి గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం. కామారెడ్డి పి.వి.పి. ఓరియంటల్‌ కళాశాలలో బి.ఓ.ఎల్‌.పూర్తి చేసుకుని, ఉస్మానియా విశ్వవిద్యాలం నిజాం కళాశాలలో ఎం.ఏ.చేసి, తెలుగు విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర విభాగంలో ఆచార్య వై.రెడ్డి శ్యామల పర్యవేక్షణలో ఎం.ఫిల్‌. చేసారు. తిరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య సాగి కమలాకర శర్మ పర్యవేక్షణలో పిహెచ్‌.డి. పూర్తిచేసారు. అనంతరం ఏ.వి. కళాశాల తెలుగుశాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా 2021-2022 వరకు, అదే సంవత్సరం కొంతకాలం నిజాం కళాశాలలో పనిచేసారు. కళ్లం (సాహిత్య వ్యాసరాశి) (2018), తెలంగాణ బి.సి.వాద సాహిత్యం (2021), మహాభారతంలో సంవదాలు - సమగ్ర పరిశీలన (సిద్ధాంత గ్రంథం) (2022), పట్నమొచ్చిన పల్లె - భాషా పరిశీలన’ (ఎం.ఫిల్‌.గ్రంథం) (2022) అనే పుస్తకాలను రచించారు. వీరి సంపాదకత్వంలో ‘నిత్యాన్వేషణం (2018), కమలాకరం (2021) సారాంశం (1వ సంపుటి 2021, 2వ సంపుటి 2022), తెలంగాణ సాహిత్య గ్రంథసూచి (2024) వెలువడ్డాయి. శిలాక్షరం (2019), తెలుగు సామెతలు సమాలోచన (2021), కామారెడ్డి జిల్లా సర్వస్వం (2023) ‘గురుతరం’ (2024), సాహితీ శ్రీరంగం (2024), విమర్శానారామం (2025), అక్షరాకాశం (2025) గ్రంథాలకు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆలోకనం (2017), శతవాసంతిక (2019) తెలంగాణ సాహిత్యం-`సమాలోచన (2019) సహాయ సంపాదకులుగా ఉన్నారు. అంబెద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఆచార్య జి.రాంరెడ్డి దూరవిద్యా కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం పి.జి.పాఠ్యాంశాల రచయిత. 80కి పైగా వివిధ పత్రికలలో వ్యాసాలు, 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్రసమర్పణలు చేసారు. 2022లో ‘కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం’, ‘తెలంగాణ సాహిత్య కళాపీఠం’ వారు అందించే ‘ప్రతిభా పురస్కారం’ అందుకున్నారు. మూడు జాతీయ సదస్సులకు సహ సంచాలకులుగా వ్యవహరించారు. ‘మూసీ’ తెలుగు మాస పత్రికకు సహ సంపాదకుడిగా పనిచేస్తున్నారు. ‘మూసీ సాహిత్యధార’ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తెలుగు సహాయ ఆచార్యులు పనిచేస్తున్నారు.